జాగ్రత్తగా.. కేసీఆర్-బాబు దోస్తీ ఎఫెక్ట్: సాగర్ డ్యాంవద్ద ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ జలాల మధ్య ఉన్న గొడవ శనివారంతో సమసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్లు గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమామహేశ్వర రావులు పాల్గొన్నారు.
అనంతరం హరీష్ రావు, ఉమామహేశ్వర్ రావులు విలేకరులతో మాట్లాడారు. జలాలను జాగ్రత్తగా పంచుకుంటామని, సరఫరాపై నిర్ణయం ఈఎస్సీలదేనని (రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్) చెప్పారు. సాగుతో పాటు తాగునీటికి ప్రాధాన్యం ఇస్తామని వారు చెప్పారు.
కాగా, ఇరు రాష్ట్రాల నడుమ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నాగార్జున సాగర్ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. గవర్నర్ వద్ద శనివారం జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల ఉన్నతస్థాయి భేటీలో సాగర్ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. దీంతో కుడి కాల్వకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడికాల్వ విద్యుత్తు కేంద్రం నుంచి మరో 2 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.
నాగార్జున సాగర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టరాల చర్చల అనంతరం నిర్మానుషంగా ఉన్న సాగర్ డ్యాం. రెండు రోజుల క్రితం ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది.
పోలీసులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టరాల చర్చల అనంతరం నాగార్జున సాగర్ వద్ద పోలీసు అవుట్ పాస్చ్ చెక్ పాయింట్ దృశ్యం.
బాబు, కేసీఆర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ జలాల మధ్య ఉన్న గొడవ శనివారంతో సమసిన విషయం తెలిసిందే.
దేవినేని, హరీష్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్లు గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమామహేశ్వర రావులు పాల్గొన్నారు.