వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వల్లే ప్రపంచానికి చేటు.. థర్డ్ స్టేజికి వెళ్ళినా పోరాడతాం : ఏపీ మంత్రి మేకపాటి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీ మంత్రి ఏపీలో తాజా పరిస్థితిపై , అలాగే కరోనా ఇంతగా ప్రబలటానికి గల కారణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం కరోనాకి సంబంధించిన వాస్తవాలని మొదట్లో దాచిపెట్టడం వల్లనే ప్రపంచానికి చేటైందని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఏపీలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పారు.

జగన్ చేతల మనిషి .. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే : వైసీపీ ఎంపీజగన్ చేతల మనిషి .. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే : వైసీపీ ఎంపీ

ఏపీలో కరోనా సెకండ్ స్టేజ్ .. థర్డ్ స్టేజ్ లో ఉన్నా ఎదుర్కొంటాం అన్న మంత్రి

ఏపీలో కరోనా సెకండ్ స్టేజ్ .. థర్డ్ స్టేజ్ లో ఉన్నా ఎదుర్కొంటాం అన్న మంత్రి

ఏపీలో కరోనా సెకండ్ స్టేజీలో ఉందన్న ఆయన థర్డ్ స్టేజీకి వెళ్లినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు . ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. ప్రజలు కొందరు మానసిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉన్నందున, అటువంటి వారిని కూడా ట్రాక్ చేస్తున్నామన్నారు. అలాంటి వారికి మానసిక స్థైర్యం కలిగిస్తామని చెప్పారు. నిరుపేదల కోసం ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని పేర్కొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్ని వర్గాల వారిని ఈ విపత్తు సమయంలో ఆదుకోటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

రైతులకు భరోసా ఇచ్చిన మేకపాటి

రైతులకు భరోసా ఇచ్చిన మేకపాటి

ఇక రైతులు దిగులు పడాల్సిన అవసరం లేదని , ధాన్యం, ఇతర పంటలని కొనుగోలు చేయమని కలెక్టర్లని గతంలో ఆదేశించడం జరిగిందని చెప్పారు . ప్రస్తుత నేపథ్యంలో రైతులకి నష్టం రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు . ఇక ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిత్యవసర సరుకులు కోసం ఒక్కసారిగా ప్రజలు బయటకి రాకుండా డోర్ డెలవరీ సౌకర్యం కల్పించామని కూడా ఆయన పేర్కొన్నారు .

రాష్ట్రంలోకి ఎవరినీ అనుమతించం

రాష్ట్రంలోకి ఎవరినీ అనుమతించం

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యవసరాలకి ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు మేకపాటి . ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు . ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్లిన వారిని రాష్ట్రంలోకి అనుమతివ్వమని ఆయన పేర్కొన్నారు . ఇతర రాష్ట్రాల వారు ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకి వెళ్లేందుకు కూడా అనుమతివ్వలేమని ఆయన చెప్పారు . అలాంటి వారికి కొదొఆ సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు . లాక్ డౌన్ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది, జర్నలిస్టులకి సేఫ్టీ కిట్స్ అందిస్తామని చెప్పారు మేకపాటి .

English summary
While the corona virus is creating tension to the world, the AP minister made interesting comments on the latest situation in the AP, as well as the reasons why corona is so prevalent. AP Minister Mekapati Gautam Reddy said that the Chinese country was initially hiding the facts of Corona. The minister said the government is working hard on corona control in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X