వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసక్తికరం: వైసీపీ కార్యకర్తలకు చింతమనేని చాక్లెట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ కార్యకర్తలకు చాక్లెట్లను పంచారు. ఎవరి కార్యక్రమాలు వారివేనని చింతమనేని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర ఏలూరు రూరల్ మండలంలోని లింగాలగూడెంకు చేరుకొంది. అయితే అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా జగన్ పాదయాత్ర అడ్డుగా వచ్చింది.

Chintamaneni stuck in Jagan padayatra

దీంతో జగన్ పాదయాత్ర కారణంగా చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

చింతమనేని కారులో ఉండగా ఆయనతో కొందరు వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు. జగన్ పాదయాత్రను చూసేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులకు చింతమనేని ప్రభాకర్ చాక్లెట్లు ఇచ్చారు.

Recommended Video

మరో చరిత్ర సృష్టించనున్న జగన్ ప్రజాసంకల్పయాత్ర

ఎవరి కార్యక్రమాలు వారివేనంటూ చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తు మధ్య చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ను అక్కడి నుండి పంపించివేశారు.

English summary
In a tense situation for the police, the convoy of Telugu Desam Party (TDP) legislator, Chintamaneni Prabhakar got stuck in the Praja Sankalpa Yatra of YSRCP chief, Jagan. The padayatrs of Jagan was going on at Lingalaguda of Eluru rural mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X