చెప్పుల్లేకుండా తిరిగి చంద్రబాబుకు, తండ్రీకొడుకులిద్దరూ...: చింతా
చంద్రబాబు నాయుడిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత చింతా మోహన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చెప్పుల్లేకుండా తిరిగి చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత చింతా మోహన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చెప్పుల్లేకుండా తిరిగి చంద్రబాబుకు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
పోలవరం పేరు చెప్పి తండ్రీకొడుకులిద్దరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబును, నారా లోకేష్లను ఉద్దేశించి అన్నారు. అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించారు.
సాధారణ ఎన్నికలకు ముందు బాబువస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు. తన ఇంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన చంద్రబాబుపై విరుుకుపడ్డారు.
శాంతియుతంగా పాదయాత్ర నిర్వహించుకుంటానని చెప్పిన ముద్రగడ యాత్రకు ఆంక్షలు విధించడం సరికాదని ఆయన అన్నరు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే క్కు అందరికీ ఉందని, రాష్ట్ర డిజిపి సాంబశివ రావు టిడిపి నాయకుడిగా మాదిరిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.