వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పేలుడు మా పనే: చిత్తూరు జిల్లా పోలీసులకు ఉగ్రవాదుల లేఖ

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులకు సోమవారం నాడు ఉగ్రవాదుల పేరిట ఓ లేఖ వచ్చింది. అల్ ఖైమా అనే ఉగ్రవాద సంస్థ పేరుతో ఈ లేఖ వచ్చింది. గత వారం చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో వాహనం కింద పేలుడుకు తామే కారణమని అందులో పేర్కొన్నారు.

ఆ తర్వాత కేరళలోని కోర్టులోను బాంబు పేలుడు సంభవించింది. చిత్తూరులో జరిగిన పేలుడు, ఈ పేలుడు రెండూ ఒకే రకంగా ఉన్నాయి. దీంతో, రెండూ ఒకరే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖను, ఇందుకు సంబంధించిన విషయాలను పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు పంపించారు.

Chittoor police receives letter on the name terrorists

అలాగే, కేరళ పేలుడు, ఈ పేలుడు ఒకే రకంగా ఉండటంతో పరిశీలన నిమిత్తం ఓ పోలీసుల బృందాన్ని కొట్టాంకు పంపించారు. పేలుడు ఘటన, ఉగ్రవాదుల పేరిట లేఖను పోలీసులు సీరియస్‌గా తీసుకొని, విచారిస్తున్నారు. ఈ లేఖను ఎవరు రాశారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు అనే విషయాలపై దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Chittoor police receives letter on the name terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X