ఆ పేలుడు మా పనే: చిత్తూరు జిల్లా పోలీసులకు ఉగ్రవాదుల లేఖ
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా పోలీసులకు సోమవారం నాడు ఉగ్రవాదుల పేరిట ఓ లేఖ వచ్చింది. అల్ ఖైమా అనే ఉగ్రవాద సంస్థ పేరుతో ఈ లేఖ వచ్చింది. గత వారం చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో వాహనం కింద పేలుడుకు తామే కారణమని అందులో పేర్కొన్నారు.
ఆ తర్వాత కేరళలోని కోర్టులోను బాంబు పేలుడు సంభవించింది. చిత్తూరులో జరిగిన పేలుడు, ఈ పేలుడు రెండూ ఒకే రకంగా ఉన్నాయి. దీంతో, రెండూ ఒకరే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖను, ఇందుకు సంబంధించిన విషయాలను పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు పంపించారు.
అలాగే, కేరళ పేలుడు, ఈ పేలుడు ఒకే రకంగా ఉండటంతో పరిశీలన నిమిత్తం ఓ పోలీసుల బృందాన్ని కొట్టాంకు పంపించారు. పేలుడు ఘటన, ఉగ్రవాదుల పేరిట లేఖను పోలీసులు సీరియస్గా తీసుకొని, విచారిస్తున్నారు. ఈ లేఖను ఎవరు రాశారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు అనే విషయాలపై దర్యాఫ్తు చేస్తున్నారు.