రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన వాలీబాల్ ఆట: తీవ్ర ఘర్షణ, పలువురికి గాయాలు
చిత్తూరు: జిల్లాలోని రెండు గ్రామాల మధ్య వాలీబాల్ ఆట చిచ్చురేపింది. వాలీబాల్ ఆట కారణంగా రెండు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో ఇరుపక్షాలకు చెందిన ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఎస్ఆర్ పురం మండలంలోని పొదలపల్లి, వెంకటాపురం గ్రామాల మధ్య వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పొదలపల్లి గ్రామస్తులపై వెంకటాపురం గ్రామస్తులు ఆరుసార్లు గెలిచారు. ఈ క్రమంలో ఇరు గ్రామాలకు చెందిన యువకుల మధ్య వివాదం నెలకొంది.
ఈ
వివాదం
రెండు
గ్రామాల
మధ్య
ఘర్షణకు
దారితీసింది.
రాళ్లు,
సోడా
బాటిళ్లతో
పరస్పరం
దాడులకు
దిగారు.
ఈ
దాడుల్లో
ఏడుగురు
గాయాలపాలయ్యారు.
ఘర్షణపై
సమాచారం
అందుకున్న
పోలీసులు..
హుటాహుటిన
ఘటనా
స్థలానికి
చేరుకున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.