చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరులో మైనర్ బాలికపై పాస్టర్ రెండేళ్లుగా అత్యాచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: చిత్తూరు జిల్లాలో ఓ పాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్ధానిక షర్మన్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుల్ భర్త శామ్యూల్‌ ప్రపుల్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

పెనుమూరు మండలానికి చెందిన ఓ బాలిక స్ధానికంగా ఉన్న హాస్టల్‌లో ఉంటూ షర్మన్ బాలికోన్నత పాఠశాల్లో చదువుకుంటోంది. రెండు సంవత్సరాలుగా శామ్యూల్‌ ప్రపుల్‌ ఆ బాలికపై రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నట్లు తెలిసింది.

Church Pastor rapes Minor girl in Chittoor

ఎప్పటిలాగే బాలికను శుక్రవారం ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాస్టర్ లైంగిక వేధింపులను తట్టుకోలేక బాలిక శనివారం జరిగిన విషయాన్ని పెదనాన్నకు చెప్పింది. దీంతో ఆయన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

English summary
Church Pastor rapes Minor girl in Chittoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X