వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ : నాడు ఆరోపణలు ఎందుకు చేసామంటే :ఇక ప్రచారంలోకి..!
Recommended Video
సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవిత-రాజశేఖర్ పార్టీలో చేరిక సమయంలో నాటి పరి స్థితుల పై వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏపికి జగన్ అవసరం ఉందని.. ఎన్నికల్లో ప్రచారం చేస్తామని జీవిత - రాజశేఖర్ ప్రకటించారు.
వైసిపి లోకి జీవిత దంపతులు..
సినీ ప్రముఖ జంట జీవిత- రాజశేఖర్ వైసిపి లో చేరారు. వైసిపి అధినేత జగన్ ఆ ఇద్దరినీ పార్టీ కండువా కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు. జీవిత - రాజశేఖర్ ఏపిలో ఇప్పుడు జగన్ అవసరం ఉందని చెప్పుకొచ్చారు. గతంలో తాము జగన్ పై కొన్ని ఆరోపణలు చేసామని..అవి ఆరోపణలకే పరిమతమయ్యాయని..ఆ తరువాత తామ అసలు విషయాలు తెలు సు కున్నామని వివరించారు. అప్పటి జగన్..ఇప్పటి జగన్ వేరు అని పేర్కొన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏపి ప్రజలను కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు తమ మనస్సుల్లో ఉన్న మనస్పర్దలు తొలిగిపోయాయని వెల్లడించారు. తమకు జగన్ తో ఎటువంటి శత్రుత్వం లేదని చెప్పుకొచ్చారు జీవిత- రాజశేఖర్.
అపరిప్వతతో వ్యవహరించాం..
నాడు అందరి లాగా తాము అప్పట్లో జరిగిన ప్రచారానికి ప్రభావితం అయ్యామని..ఆ సమయంలో అపరిప్వతతో జగన్ పై ఆరోపణలు చేసామని జీవిత-రాజశేఖర్ చెప్పుకొచ్చారు.వైయస్ తరహా పాలన కావాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడద్దని ఓటర్లకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే అది వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకు నేవారు మనకొద్దని, జగన్లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలని జీవిత అన్నారు. తాము జగన్ ముఖ్యమంత్రి కావటం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ప్రకిటించారు. ఇప్పటికే జగన్ కు మద్దతుగా జయసుధ, మోహన్ బాబు, పృధ్వీ, ఎస్వీ కృష్ణారెడ్డి సినీ రంగం నుండి జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక, తాజాగా జీవిత-రాజశేఖర్ సైతం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)
జగన్ కోసమే పని చేస్తాం..
అనేక వివాదాలు..ఫిర్యాదుల కారణంగా ఎప్పుడూ వార్తలో నిలిచే జీవిత-రాజశేఖర్ ఇద్దరూ ఇప్పుడు జగన్ కోసం పని చేస్తామని ప్రకటించారు. ప్రత్యేకించి జనసేన పై ఈ ఇద్దరూ ఫోకస్ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నా రు. ఎన్నికల ప్రచారానికి ఇంకా తొమ్మది రోజులే సమయం ఉండటంతో తాము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుంటామని ఆ ఇద్దరూ ప్రకటించారు. ఇక, సినీ ప్రముఖుల రంగ ప్రవేశం తో ఏపి లో ఎన్నికల ప్రచారం మరింత హీట్ పుట్టించనుంది. టిడిపి నుండి దివ్యవాణి ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ హిందూపూర్ కే పరిమితం అయ్యారు. ఇక, ఇప్పుడు సినీ కళాకారులు ప్రచారంలోకి దిగుతుండంతో రెండు పార్టీల మధ్య వీరి ప్రభావం ఏ మేర ఉంటుందో చూడాలి.