ఆయన అనుచరులు వేధిస్తున్నారు : నటి అపూర్వ ఫిర్యాదు
వివాదాలకు మారు పేరైన పశ్చిమ గోదావరి జిల్లా నేత పై సినీ నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన అనుచరలు తనను వేధిస్తున్నారని అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని సినీ నటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యదు చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు పై ఈ ఫిర్యాదు చేసారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేని పై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని అపూర్వ ఆవేదన వ్యక్తం చేసారు.
తన కుటుంబ వ్యవహారాల పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. తనను వేధించిన వారి పై చర్యలు తీసుకో వాలని అపూర్వ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టిడిపి నేత చింతమనేని వ్యవహార శైలి పై పార్టీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వివాదాలతో సహవా సం చేసే చింతమేని తన శైలి మార్చుకోవాలని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం మంగ ళగిరి టోల్ గేట్ వద్ద చింతమనేని అక్కడి సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు అపూర్వ నేరుగా సైబర్ పోలీసులకు చింతమనేని అనుచరుల పై ఫిర్యాదు చేసారు...