విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలో విభేదాలు!: ‘జై రాధా’ నినాదాలు, ‘ఆపండయ్యా’ అంటూ మల్లాది అసహనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడలో బుధవారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో గందరగోళం నెలకొంది. నేతల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హంగామా సృష్టించారు.

వెంట్రుకంటారా?: ఆ పార్టీతో పొత్తా?: జగన్‌పై మంత్రి కామినేని తీవ్ర వ్యాఖ్యలువెంట్రుకంటారా?: ఆ పార్టీతో పొత్తా?: జగన్‌పై మంత్రి కామినేని తీవ్ర వ్యాఖ్యలు

గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోవర్గ బూత్ కమిటీల సమావేశంలో వంగవీటి రాధాను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జై రాధా నినాదులో...

జై రాధా నినాదులో...

జై రాధా, జై రంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో వైసీపీ నేత సామినేని ఉదయభాను కల్పించుకుని వారిని సముదాయించారు. ఈ శిక్షణా తరగతులకు హాజరుకావాలని రెండ్రోజులుగా వంగవీటి రాధాను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

చంద్రబాబు నా హీరో, నా డబ్బంతా ప్రజలకే, అడ్డుకోలేరు: కమల్ హాసన్చంద్రబాబు నా హీరో, నా డబ్బంతా ప్రజలకే, అడ్డుకోలేరు: కమల్ హాసన్

కాసేటికే వచ్చిన రాధ

కాసేటికే వచ్చిన రాధ

రాధ వస్తారని చెప్పడంతో ఆయన అనుచరులు శాంతించారు. కాగా, ఈ తతంగం జరిగిన కొంతసేపటి తర్వాత రాధా అక్కడికి వచ్చారు. అయితే, ఈ సమావేశానికి వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా హాజరయ్యారు.

 వేదికపైకి రాని మల్లాది

వేదికపైకి రాని మల్లాది

వేదికపైకి రావాలంటూ విష్ణును ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్లలేదు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్ కల్పించుకుని విష్ణుని వేదికపైకి రావాలని కోరినా.. ఫలితం లేకపోయింది.

‘ఆపండయ్యా' అంటూ మల్లాది అసహనం

‘ఆపండయ్యా' అంటూ మల్లాది అసహనం

వంగవీటి రాధా రాకకు ముందు జై రాధా, జై రంగా అంటూ అనుచరులు హోరెత్తించడంపై మల్లాది విష్ణు ఒకింత ఆసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ‘ఆపండయ్యా' అంటూ మల్లాది వారిని వారించే ప్రయత్నం చేశారు.

English summary
Clashes occurred between YSRCP leaders Malladi Vishnu and Vangaveeti Radha followers in YSRCP meeting held in Vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X