దాడుల వెనుక భారీ కుట్ర - సీఎం రాష్ట్రాన్ని ధ్వంసం చేసారు : రఘురామను కొట్టించారు - చంద్రబాబు దీక్ష..!!
టీడీపీ కార్యాలయాల పైన దాడుల వెనుక భారీ కుట్ర ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో దాడి జరిగిన ప్రాంతంలోనే దీక్షకు కూర్చుకున్నారు. టీడీపీ కార్యాలయం పైన దాడి ప్రజాస్వామ్యం పైన దాడిగా అభివర్ణించారు. టీడీపీని నిర్వీర్యం చేయాలని.. పార్టీ లేకుండా చేయాలని భయపెట్టాలని చూస్తున్నారంటూ..అది సాధ్యం కాదని హెచ్చరించారు. ఆ రోజున తాము మీటింగ్ లో ఉంటే పట్టాభి ఇంటి పైన దాడి విషయం తెలిసిందన్నారు.
రఘురామ రాజును రాత్రంతా కొట్టారు
టీడీపీ కార్యలయం పైన దాడికి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం తెలిసి డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని చెప్పారు. తాను వెంటనే గవర్నర్..అమిత్ షా కు ఫోన్ చేసి పరిస్థితి వివరించానని చెప్పారు. డ్రగ్స్ వ్యవహారం పైన ఫోకస్ పెట్టాలని.. ఒక్క సారి యువత డ్రగ్స్ కు అలవాటు పడితే బానిసలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గా పేర్కొన్నారు. రఘురామ రాజు ను రాత్రంతా తమ ఆధీనంలో ఉంచుకొని కొట్టి కొట్టి గాయపరిచారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలన విధించాలంటూ
టీడీపీ శ్రేణులకు తమను తాము కాపాడుకొనే శక్తి ఉందన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని మరోసారి డిమాండ్ చేసారు. పార్టీ ఆఫీసుకు వచ్చి దాడి చేసి.. టీడీపీ నేతల పైనే కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజీపీ తీరు పైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. డీజీపీ హాట్సాఫ్ అంటూ వ్యాఖ్యానించారు. మంత్రులు తమ పైన చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో సహజ వనరులను దోచేసారంటూ చంద్రబాబు ఆరోపించారు. మైనింగ్..ఇసుక..మద్యం అంశాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రాన్ని ధ్వంసం చేసారు..టీడీపీ అధికారంలోకి వచ్చినా
విద్యుత్ ఛార్జీలు పెంచేసారని..విద్యుత్ వ్యవస్థను నాశనం చేసారని చెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం ధ్వంసం అయిందన్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చినా..తిరిగి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలమా అనే భయం కలుగుతోందన్నారు. ఈ సీఎం డబ్బు వ్యామోహంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ నియంత్రించే వరకూ ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా..దాని మూలాలు ఏపీలోనే దొరుకుతున్నాయని చెప్పారు.
Recommended Video
డ్రగ్స్ విషయంలో పోరాటం చేస్తామంటూ
గంజాయి..డ్రగ్స్ పైన సీఎం ఒక్క మీటింగ్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు..పోలీసులు మీ పదవుల కోసం కాదు..పిల్లల భవిష్యత్ కోసం ఆలోచన చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మా మంచితనాన్ని చూసారు. భవిష్యత్ లో మీకు శిక్ష పడేంత వరకు వదిలిపెట్టనని హెచ్చరించారు. మంత్రులు..వైసీపీ నేతలు మాట్లాడుతారు. కులాల మధ్య చిచ్చు ఎవరు పెడుతున్నారు..వైసీపీ పెడుతోందని చంద్రబాబు ఆరోపించారు. రెండున్నారేళ్లుగా టీడీపీ ఆవేదన పడుతున్నారని..వారి జీవితాలు ఎప్పుడూ మర్చిపోనని చంద్రబాబు స్పష్టం చేసారు.