అసెంబ్లీకి మిధున్, అవినాశ్ - జగన్ కొత్త లెక్కలు, జాబితా సిద్దం..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో అనూహ్య మార్పులు చేస్తున్నారు. ఎంపీలను కొందరిని అసెంబ్లీకి పంపుతున్నారు. కొందరు మంత్రుల ను ఎంపీలుగా ఖరారు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు - చేర్పుల పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సీట్ల దక్కని వారికి సీఎం జగన్ కీలక హామీలు ఇస్తున్నారు.
తుది కసరత్తు : ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో తన అభ్యర్దులను ఫైనల్ చేస్తున్నారు. ఇంఛార్జ్ ల మార్పు కసరత్తు తుది దశకు చేరుకుంది. దాదాపు 30 మంది వరకు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీల్లోనూ 11 మంది వరకు మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఈ సారి ఎంపీలుగా ఉన్న పలువురిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. అందులో భాగంగా కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్దిగా ఖరారు చేసారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈ సారి పీలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలిపే అంశం పైన కసరత్తు జరుగుతోంది. కానీ, మిథున్ మాత్రం తాను లోక్ సభకే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి అర్బన్ నుంచి ఖరారు చేసారు.

ఎమ్మెల్యేలుగా ఎంపీలు : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సారి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ కుటుంబం నుంచి ఒక వైద్యుడి పేరు ప్రచారంలో ఉంది. దీని పైన జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ పైన స్పష్టత రావాల్సి ఉంది. మాజీ మంత్రి బాలినేని తిరిగి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ఎమ్మిగనూరు టిక్కెట్ను సిట్టింగ్ కేశవరెడ్డికి కాకుండా.. ఈసారి బీసీలకు ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించిన వైసీపీ బుట్టా రేణుక అభ్యర్ధిత్వం పరిశీలిస్తోంది. కర్నూలు ఎంపీగా ఒక మంత్రి పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది.

మార్పులు - చేర్పులు : గోదావరి జిల్లాల్లో మార్పుల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. హిందూపురం ఎంపీ అభ్యర్దిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో జగన్ నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రూట్ క్లియర్ అయింది. తిరిగి ఆయన మైలవరం నుంచే ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. విజయవాడ, ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. జనవరి 1న పెన్షన్ రూ 3 వేలకు పెంపు..తరువాత వరుసగా సంక్షేమ పథకాల పైన కార్యాచరణ సిద్దమైంది. వీటి విడుదల సమయం నుంచి కొత్త ఇంఛార్జ్ లు ప్రజల్లోకి పంపాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ రోజు లేదా రేపు మార్పుల జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications