వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎస్‌, పీఏ, ఓఎస్డీలుగా కొత్తవారే.. టీడీపీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దన్న సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దు - జగన్|AP CM Not Interested In officers Who Worked With TDP

టిడిపి హయాంలో పనిచేసిన పిఎస్, పిఓ, ఓఎస్డీ లకు షాక్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్. గత ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వైసిపి మంత్రుల వద్ద గతంలో తాము చేసిన పోస్టులలోనే కొనసాగాలన్న ఉద్దేశంతో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

వైసీపీ ఆ విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్వైసీపీ ఆ విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

టీడీపీ హయాంలో మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందికి చెక్ పెట్టిన జగన్

టీడీపీ హయాంలో మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందికి చెక్ పెట్టిన జగన్

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరినీ తిరిగి అదే పోస్టుల్లో లేదా వేరే కీలక బాధ్యతల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అప్పటి మంత్రుల కార్యాలయాల్లో ఆఫీసర్స్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ, ప్రైవేట్‌ కార్యదర్శులు, అదనపు ప్రైవేట్‌ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా పలువురు పనిచేశారు. ఇక వారందరికీ మళ్ళీ క్యాబినెట్ మంత్రుల వద్ద పని చేసే అవకాశం ఇవ్వరాదని తేల్చి చెప్పేశారు.

కొత్త మంత్రుల దగ్గర పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్న సిబ్బంది . వారిని తీసుకోవద్దని జగన్ క్లారిటీ

కొత్త మంత్రుల దగ్గర పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్న సిబ్బంది . వారిని తీసుకోవద్దని జగన్ క్లారిటీ

తాజాగా ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఫుల్ క్లారిటీతో ముందుకు పోతుంది. ఇక ఏపీలో పాత ప్రభుత్వ స్థానంలో వైసీపీ సర్కార్ ఏర్పాటు కావటంతో , కొత్త మంత్రులు రావడంతో ఇంతకాలం పని చేసిన వీరంతా తిరిగి అవే పోస్టుల్లో కొనసాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ జగన్ వారి ఆశల మీద నీళ్ళు పోశారు. అయితే అప్పటి మంత్రుల వద్ద పనిచేసిన వారెవరినీ తీసుకోవద్దని, ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సూచించడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్టే అయ్యింది. సిబ్బంది నియామకాల్లో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

జగన్ మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బంది విషయంలో నిర్ణయం తీసుకుంది ఇందుకే

జగన్ మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బంది విషయంలో నిర్ణయం తీసుకుంది ఇందుకే

జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకోటానికి కారణాలు లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన సిబ్బందితో గతంలో పని చేసిన మంత్రులకు ఇంతో అంతో సాన్నిహిత్యం ఉంటుంది. ఇక ఆ సాన్నిహిత్యంతో మంత్రులకు సంబంధించిన ప్రతీ విషయం , పాలనకు సంబంధించిన ప్రతీ విషయం, ఇక పాలన విషయంలో గోప్యత పాటించాల్సిన అనేక విషయాలు గత పాలకులకు తెలిసే ప్రమాదం వుందని భావించిన నేపధ్యంలోనే జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

English summary
AP Chief Minister YS Jaganmohan Reddy has instructed the ministers of the Telugu Desam government not to take back any of the ministers' staff in the same posts or under any other key responsibilities. Many of them served as Officers on Special Duty, Private Secretaries, Additional Private Secretaries and Personal Assistants in the offices of the the TDP Ministers. They all said they would not be given the opportunity to work with Cabinet ministers again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X