వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్ కు సమాచారం అందించారు . ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని గడచిన 24 గంటల్లో 82 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తున్నారని, ఆస్పత్రుల్లో ఎక్కాడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు .

అమరావతి పోయి ఆంధ్రప్రదేశ్ వచ్చె: రాష్ట్రం మొత్తానికీ ఆ ప్రాజెక్టు వర్తించే సంకేతాన్ని ఇచ్చిన జగన్అమరావతి పోయి ఆంధ్రప్రదేశ్ వచ్చె: రాష్ట్రం మొత్తానికీ ఆ ప్రాజెక్టు వర్తించే సంకేతాన్ని ఇచ్చిన జగన్

ఇక కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో అధిక సగటు నమోదుతో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సగటు 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే దేశంలో మరణాల రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే ఏపీలో 2.46 శాతం అని వెల్లడించారు. ఇక ఈ కేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్లనుంచే వస్తున్నాయని స్పష్టం చేశారు.

CM Jagan Review on Corona Control ...AP First Place in Tests

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !

ఇక సీఎం జగన్ వైద్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు . ల్యాబ్ లు పెంచమని చెప్పిన జగన్ ఆ విషయంపై ఆరా తీశారు. ఇక పెరుగుతున్న కేసుల నేపధ్యంలో శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్‌లు సిద్ధం అవుతున్నాయని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ల్యాబ్‌ల ఏర్పాటుపై కూడా దృష్టిపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు.

English summary
CM Jagan reviewed corona control measures in the wake of increasing corona cases in AP. Jawahar Reddy, Special Secretary to the Ministry of Health informed the CM through the video conference. Officials have brought to the notice of the Chief Minister that 80,334 corona tests have been conducted in the state so far.Andhra Pradesh claims to be the first state in the country with the highest average of corona virus tests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X