పవన్ కల్యాణ్ ఫ్యాన్కు సీఎం జగన్ సాయం: ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతనిచ్చారు. ఆపరేషన్ కోసం సాయం చేసి తన ఉదారతను చాటుకొన్నారు. ప్రస్తుతం అభిమాని నాగేంద్ర ఆరోగ్యం స్థిమితంగా ఉంది అని వైద్యులు తెలిపారు. ఏమీ ఫరావలేదు అని చెప్పడంతో నాగేంద్ర కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి అత్యవసరంగా చికిత్స చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. దీనిని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం జగన్ స్పందించారు. నాగేంద్ర సర్జరీ కోసం రూ.10లక్షలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
సీఎం జగన్ ఆదేశాలతో సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ.. పవన్ అభిమాని నాగేంద్ర వైద్యం చేయించుకుంటున్న ఆస్పత్రికి ఎల్వోసీ అందజేశారు. సీఎం జగన్ చేసిన సాయంతో నాగేంద్రకు వైద్యులు స్టెమ్ సెల్ థెరపి చేశారు. ఆపరేషన్ తర్వాత అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు తెలిపారని సీఎంవో అధికారులు పేర్కొన్నారు.