వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు, మూడు రోజుల్లో ఆ పని పూర్తి చెయ్యండి .. ఇళ్ళ పట్టాల పంపిణీపై సీఎం వైఎస్ జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు' పై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అర్హులని తేలితే 90 రోజుల్లోగా ఇంటి స్థలం పట్టా అందించాలని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు.

గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌ లు : సీఎం జగన్గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌ లు : సీఎం జగన్

రెండు మూడు రోజుల్లో మిగతా ఇళ్ళ పట్టాల పంపిణీ పూర్తి చెయ్యాలన్న జగన్

రెండు మూడు రోజుల్లో మిగతా ఇళ్ళ పట్టాల పంపిణీ పూర్తి చెయ్యాలన్న జగన్

రాష్ట్ర వ్యాప్తంగా 30,06,673 ఇళ్ల పట్టాలకు గాను 26 ,21,049 ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఇప్పటివరకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 87.17 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని, కాలనీలలో 90 శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మిగతా పట్టాల పంపిణీ కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

సోషల్ ఆడిట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్న సీఎం

సోషల్ ఆడిట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్న సీఎం

ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న తొలి పన్నెండు రోజుల్లో వాలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బంది భౌతికంగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలని ఆదేశించారు. సోషల్ ఆడిట్ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు జగన్. వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను జగన్ కు అధికారులు వివరించారు. వైయస్సార్ జగనన్న కాలనీలలో అంగన్వాడీ కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, స్కూళ్లను, బస్ స్టాప్ లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.

వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇంటర్నెట్ సదుపాయం

వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇంటర్నెట్ సదుపాయం

అయితే వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని మౌలిక వసతులు కల్పించడం తో పాటుగా, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సూచించారు జగన్. డంపింగ్ యార్డులలో బయో మైనింగ్ చేయాలని వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఒక పక్క పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నా సీఎం జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో సమీక్షలు కొనసాగిస్తూ ప్రజల వద్దకే పాలన చేరేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Recommended Video

AP Panchayat Elections Candidates Eligibility పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు, అనర్హులు ఎవరు?.

English summary
AP CM YS Jagan Mohan Reddy held a review meeting today at the CM's camp office on 'Navaratnas - Homes for the Poor'. On the occasion, Jagan Mohan Reddy told the officials that those who have applied for the house site should be given the title deed of the house within 90 days if they are found eligible. In all, 87.17 per cent of the house deeds have been distributed across the state and more than 90 per cent of the distribution in the colonies has been completed, officials told CM Jagan. CM Jagan also directed that the distribution of the remaining house deeds should be completed within two to three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X