దాసరి నారాయణ రావుకు సమన్లు ఎందుకు: కోల్ స్కాంలో సిబిఐ కోర్టు
ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను సాక్షిగా పిలువాలంటూ దాఖలైన పిటిషన్ పైన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 19వ తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ ఇస్పాత్ సంస్థ డైరెక్టర్ ఆర్ఎస్ రుంగ్తా పిటిషన్ దాఖలు చేశారు.
తనకు మద్దతుగా సాక్ష్యం ఇచ్చేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు నాటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావును కూడా పిలిపించాలని ఆయన కోరారు. ప్రధాని కార్యాలయం, బొగ్గు శాఖల నుంచి తెచ్చిన పత్రాలు అసలైనవేనా అన్న దాని పైన వారు సాక్ష్యం ఇవ్వాలని రుంగ్తా తరఫు లాయర్ పేర్కొన్నారు.
వాదనల సందర్భంగా కోర్టు... రుంగ్తా తరఫు న్యాయవాదిని ప్రశ్నిస్తూ... మన్మోహన్ సింగ్, దాసరి నారాయణ రావులకు ఎందుకు సమన్లు జారీ చేయాలని ప్రశ్నించింది. అందుకు రుంగ్తా తరఫు లాయర్ స్పందిస్తూ... వారు సాక్షులు అని చెప్పారు.