కమెడియన్ పృధ్వీ కి కీలక పదవినిచ్చిన జగన్ .. పృధ్వీ కే ఎందుకంటే
Recommended Video
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని కమెడియన్ పృధ్వీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ . గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా, పార్టీ కోసం ప్రచారం చేసిన తెలుగు కమెడియన్ పృథ్వికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన పదవిని అప్పగించారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్కు (ఎస్వీబీసీ) చైర్మన్గా ఆయనను నియమించారు. చాలా పెద్ద కీలక బాధ్యతను ఆయనకు అప్పగించారు.
టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్గా దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో చానల్ చైర్మన్గా రాఘవేంద్రరావు నియమితులైన రాఘవేంద్రరావు దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూనే ఆయన ఎస్వీబీసీ చానెల్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాఘవేంద్రరావు రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇక ఆస్థానంలో పృధ్వీ కి ఛాన్స్ దక్కింది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీలో చేరారు. పృథ్వీ ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్ నటుడు కమెడియన్ పృథ్వీ జాక్ పాట్ కొట్టినట్టుగా తెలుస్తుంది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పని చేసిన పృథ్వీకి జగన్ ప్రభుత్వం గట్టి బహుమానమే ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం టీటీడీ కమిటీ సభ్యులు ఎస్వీబీసీ చైర్మన్ తదితర పోస్టుల భర్తీ మాత్రం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి సినీ ఇండస్ట్రీ నుండి గట్టి సపోర్టర్ గా నిలిచిన పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కిందని తెలుస్తుంది. వైసీపీ కోసం పని చేసిన జీవితా రాజశేఖర్ , జయసుధ, అలీ , మోహన్ బాబు వంటి ప్రముఖులైన నటీనటులు ఉన్నప్పటికీ మొదటి నుండి వైసీపీ కి , జగన్ కి కట్టుబడి పని చేసినందుకే పృధ్వీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి పృధ్వీ రొట్టె విరిగి నేతిలో పడిందని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు .