ఆరు నెలల్లో నిన్ను లేపేస్తా: వైసీపీ నేతకు ఏపీ మంత్రి కుమారుడి వార్నింగ్
మంత్రి బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి.. ఆరు నెలల్లోగా లేపేస్తానంటూ తనను బెదిరిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయవాడ: ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డిపై శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మంత్రి బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి.. ఆరు నెలల్లోగా లేపేస్తానంటూ తనను బెదిరిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. బొజ్జల కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉన్నందునా తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని కోరారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో కలిసి మధుసూదన్ రెడ్డి ఎస్పీని కలిరు.
కాగా, గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబతో వాగ్వాదానికి దిగి బొజ్జల సతీమణి బృందమ్మ వివాదంలో నిలిచారు. టీడీపీ నేతల ఆదేశాలను పట్టించుకోలేదని, వారు చెప్పినట్లుగా నడుచుకోని కారణంగా.. బృందమ్మ ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టు గతంలో వార్తలు వచ్చాయి.
ఆలయంలో వైఫల్యాలపై సూచనలు చేస్తే స్వీకరిస్తాం గానీ స్వయంగా తనిఖీలకు దిగవద్దంటూ గతంలో ఈవో బృందమ్మకు స్పష్టం చేశారు. అయితే బృందమ్మ తీరులో మాత్రం మార్పు రాకపోవడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్దం కావాల్సి వచ్చిందన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు తరుచూ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం ఆ పార్టీ ఇమేజీని దెబ్బతీసేదిగా మారుతోంది.