‘దౌర్జన్యాలు’: పరిటాల సునీత, శ్రీరామ్పై ఎస్పీకి జగన్ పార్టీ నేత ఫిర్యాదు
అనంతపురం: దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తన ఆధ్వర్యంలో హంద్రినీవా ఆయకట్టుకు నీరు కోసం స్థానికంగా రైతు సభకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సభను అడ్డుకునేందుకు మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్, తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని ఆయన గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. దీంతో రామగిరిలో గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిర్వహించేందుకు తలపెట్టిన రైతు సభను అడ్డుకోవడం సమంజసం కాదని ప్రకాశ్ రెడ్డి అన్నారు.
Comments
English summary
YSR Congress Party leader Prakash Reddy on Thursday Complaint on Andhra Pradesh Minister Paritala Sunitha and her son Sriram to District SP.
Story first published: Thursday, May 5, 2016, 15:32 [IST]