కేసీఆర్ గారూ! గెలిచినందుకు శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేష్, జగన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు.
Congratulating KCR garu for winning the Assembly elections in Telangana.
— N Chandrababu Naidu (@ncbn) December 11, 2018
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు అని చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో కేసీఆర్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిందుకు కాంగ్రాట్స్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
Hearty congratulations to Telangana CM Sri K. Chandrasekhara Rao garu and all the winners of the assembly elections in MP, Rajasthan, Chhattisgarh and Mizoram.
— Lokesh Nara (@naralokesh) December 11, 2018