నంద్యాల ఉపఎన్నికను రద్దు చేయాలి: ఈసీకి కాంగ్రెస్ వినతి
నంద్యాల ఉపఎన్నికను రద్దుచేయాలని ఈసీకి కాంగ్రెస్ కోరింది.ఈ ఎన్నికల్లో టిడిపి, వైసీపీలు ఓటర్లను ప్రలోభపెడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపణ.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలను రద్దు చేయాలని మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.
గంగుల ఎఫెక్ట్: వైసీపీకి షాక్, గోస్పాడుపై పట్టుకు ప్రతాప్రెడ్డి వ్యూహం
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్ ను కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం డబ్బు పంపిణీపై ఆయనకు ఫిర్యాదు చేశారు.
టిడిపి, వైసీపీల అభ్యర్థులూ పోటాపోటీగా డబ్బులను పంచుతున్నారని, ఈసీ తరఫున చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. వినతిపత్రాన్ని పై అధికారులకు పంపుతానని ఈ సందర్భంగా హేమాన్ష్ హామీ ఇచ్చారు.
గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?