అనారోగ్యంతో కాంగ్రెస్ మాజీ మహిళా ఎమ్మెల్యే మృతి
కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా పామర్రు నియోజకవర్గం మాజీ మహిళా ఎమ్మెల్యే గాదం కమలాదేవి(86) గురువారం ఉదయం మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెని చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ కోలుకోలేదు. ఈ నేపథ్యంలో గురువారం పరిస్థితి మరింత విషమించి మృతిచెందారు. గాదం కమలాదేవి 1972లో పామర్రు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాలంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా, టీటీడీ సభ్యురాలుగా, క్వయర్ బోర్డ్ సభ్యురాలుగానూ ఆమె పనిచేశారు.
మాజీ ఎమ్మెల్యే కమలాదేవికి నలుగురు సంతానం కాగా వీరు రమేష్, మహేష్, హరీష్ అనే ముగ్గురు కుమారులు, అనురాధ అనే కుమార్తె ఉన్నారు. కమలాదేవి పీఏసీ చైర్మన్గా కూడా అప్పట్లో బాధ్యత నిర్వహించడం గమనార్హం.
కమలాదేవి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో గాదం కమలాదేవి ముందంజలో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. కాకినాడ నగరంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి ఆమె తన వంతు సహాయం అందించారని కొని యాడారు.