ప్రత్యేక హోదా కోసం టిడిపి ఇప్పటికైనా పోరాడాలి: సి. రామచంద్రయ్య
అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య స్వాగతించారు.ప్రత్యేక హోదాపై టిడిపి ఇప్పటికైనా పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత రామచంద్రయ్య సూచించారు.
కడపలో మంగళవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి అన్యాయం జరిగిందని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ జెఎఫ్సి పేరుతో కాలాయాపన చేయడమేనని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.పీకి జరిగిన అన్యాయంపై కమిటీ వేయాలని రామచంద్రయ్య పవన్ కళ్యాణ్కు సూచించారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీలు కలిసి బిజెపిపై పోరాటం చేయాలని రామచంద్రయ్య సూచించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు చేయాలని తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
ఇదే తరహలోనే టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు కూడ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకుగాను ప్రయత్నించాలని కాంగ్రెస్ నేత రామచంద్రయ్య సూచించారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.