పొత్తుల గోల: పాల్వాయి ఇంటి ముందు ధర్నా
దీనిపై స్పందించిన పాల్వాయి మునుగోడును సిపిఐకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సిపిఐతో పొత్తు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఆయన అన్నారు. సిపిఐతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుందని పాల్వాయి తెలిపారు.
అయితే మునుగోడు నుంచి పాల్వాయి కుమార్తె స్రవంతిని పోటీలోకి దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయతే ఈ స్థానానికి సిపిఐకి కేటాయించారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో కార్యకర్తలు పాల్వాయి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
మునుగోడును సిపిఐకి కేటాయిస్తే స్రవంతిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపాలని కార్యకర్తలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పాల్వాయి నివాసంలో ముఖ్య అనుచరులతో చర్చలు జరుగుతున్నాయి. స్రవంతి రెడ్డి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.