మధ్నాహ్నానికి తొలి ఫలితం: 25వేల మంది సిబ్బంది..25వేల మందితో భద్రత: సీఈవో ద్వివేదీ..!
ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు..25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్..భద్రతా సిబ్బంది ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లకు చేరుకున్నారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రంలో రెండేసి హాళ్లు చొప్పున 14 టేబుళ్లను ఏర్పాటు చేసారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మధ్నాహ్నానికి తొలి ఫలితం వెల్లడి కానుంది.
8గంటలకు కౌంటింగ్ ప్రారంభం...
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం అయింది. గురువారం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల కు ఓట్ల లెక్కింపు జరగనుంది. 13 జిల్లాల్లో 34 ప్రాంతాల్లో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసారు. పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ప్రకటించారు. ఒక్కో కేంద్రంలో రెండేసి హాళ్లు చొప్పున..14 టేబుళ్లు ఏర్పాటు చేసారు. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గా ల కోసం 14 టేబుళ్లు కేటాయింపు కేటాయించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్ల బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఇక, చివర్లో ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పుల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
ప్రత్యేక నిఘా..50 వేల మంది సిబ్బంది..
ఏపీలో
కౌంటింగ్
ప్రక్రియ
పర్యవేక్షణ
కోసం
ఈసీ
తరపున
ఇద్దరు
ప్రత్యేక
పరిశీలకులను
నియమించారు.
కౌంటింగ్
హాల్స్
వద్ద
మూడంచెల
భద్రత
ఏర్పాట్లు
చేసారు.
టింగ్
హాల్
వద్ద
100మీటర్ల
దూరం
నుంచి
ఎవరైనా
నడిచి
వెళ్ళాల్సిందేనని
స్పష్టం
చేసారు.
రాష్ట్రంలో
కౌంటింగ్
కొసం
25వేల
మందితో
భద్రతా
ఏర్పాట్లు
చేసిన
అధికారులు..
45కంపెనీల
కేంద్ర
సాయుధ
బలగాలు
రాష్ట్రంలో
సిద్దంగా
ఉంచారు.
కౌంటింగ్
వద్ద
ఎలాంటి
ఆందోళనలకు
అనుమతి
లేదని
అధికారులు
స్పష్టం
చేసారు.
కౌంటింగ్
సిబ్బంది
మొత్తానికి
పక్కా
ట్రైనింగ్
ఇచ్చారు.
ప్రతి
కౌంటింగ్
సెంటర్
వద్ద
ఇద్దరు
బెల్
ఇంజినీర్లు
అందుబాటులో
ఉంచారు.
2.11లక్షల
పోస్టల్
బ్యాలెట్,
28వేల
సర్వీస్
ఓట్లు
వచ్చాయి.
3.05లక్షల
పోస్టల్
బ్యాలెట్
లు
జారీ
చేశారు.
8గంటలకు
పోస్టల్,
సర్వీస్
ఓట్లను
తొలుత
లెక్కిస్తారు.
ప్రతి
అసీంబ్లీకి
ఒక
పరిశీలకుడు,
పార్లమెంట్
కి
ఒక
పరిశీలకుడు
అందుబాటులో
ఉన్నారు
రౌండ్ వారీగా ఫలితాలు..
హాల్ సామర్ధ్యం ఆధారంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ వారీగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటర్ ఏర్పాటు చేసారు. ఓట్ల లెక్కింపు కోసం 25వేల మంది కౌంటింగ్ సిబ్బంది, 25 వేల మంది సాయుధ బలగాలు కౌంటింగ్ విధుల్లో ఉంటారు. మధ్నాహ్నం 2గంటలకల్లా ఫలితాలు రానున్నాయి. వీవీ ప్యాట్ ల లెక్కింపుకు కొంత ఆలశ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు.