శ్రీవారి సేవలో నటి శ్రియ: రూ.1కోటి వజ్ర కిరీటం ఇచ్చిన దంపతులు (పిక్చర్స్)
చిత్తూరు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు వజ్ర కిరీటాన్ని బహూకరించారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాలమురుగన్, ఆయన సతీమణి అపర్ణలు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వారి శ్రీవారికి రూ.1 కోటి విలువైన వజ్ర కిరీటాన్ని బహూకరించారు. దాతను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను బాలమురుగున్ - అపర్ణ దంపతులు కలిసి ఈ కిరీటాన్ని అందజేశారు.
వజ్ర కిరీటం బహూకరణ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు వజ్ర కిరీటాన్ని బహూకరించారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాలమురుగన్, ఆయన సతీమణి అపర్ణలు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.
వజ్ర కిరీటం బహూకరణ
ఈ సందర్భంగా వారి శ్రీవారికి రూ.1 కోటి విలువైన వజ్ర కిరీటాన్ని బహూకరించారు. దాతను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్తకరించి, వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
వజ్ర కిరీటం బహూకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను బాలమురుగున్ - అపర్ణ దంపతులు కలిసి ఈ కిరీటాన్ని అందజేశారు.
వజ్ర కిరీటం బహూకరణ
కాగా, గతంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి వారికి రూ.45 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని బహూకరించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారికి అధిక మొత్తంలో విరాళాలు శనివారం అందాయి. బెంగళూరుకు చెందిన సాయి సుముఖ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత చింతగుంపల రజనీకుమార్ తిరుమలలో టిటిడి ఈవో సాంబశివరావును కలిసి రూ.10 లక్షల విరాళానికి సంబంధించిన డీడీలను అందచేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు
విరాళం మొత్తాన్ని బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని కోరారు. నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద ఉత్తరప్రదేశ్కు చెందిన అశోక్ కుమార్ గుప్తా రూ.12 లక్షలు, గీతాగుప్తా రూ.10 లక్షలు, మైసూరుకు చెందిన రోహన్ రూ.10 లక్షలు, బాలమందిరం ట్రస్టు కింద రూ. లక్ష, ప్రాణదానం ట్రస్టు కింద రూ. లక్ష వంతున మొత్తం రూ.44 లక్షల వంతున విరాళాలు అందాయి. దాతలను టిటిడి అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు
తిరుమల శ్రీవారిని సినీనటి శ్రియ శనివారం దర్శించుకున్నారు. వేకువ జామున స్వామివారి సుప్రభాతం సేవలో నటి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారి మందిరం ఎదుట నటిని చూడటానికి అభిమానులు పోటీపడ్డారు. తిరుమలకు వచ్చినప్పుడల్లా స్వామివారి సుప్రభాతం సేవలోనే శ్రియ పాల్గొంటున్నారు.