వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడా.. నీవే దిక్కు: వైఎస్ఆర్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ట్వీట్: జగన్, సాయిరెడ్డికి ట్యాగ్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: మూడనెలలుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోన్న ఒకే ఒక్క పేరు కరోనా వైరస్. భూగోళాన్ని చుట్టేసిన ఈ వైరస్ వేలమందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిలో తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ దాని మీద దృష్టిని కేంద్రీకరించాయి. దాన్ని నియంత్రించడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. భారత్‌పైనా పంజా విసిరిందీ వైరస్. దీన్ని నియంత్రణపై అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఏపీ, తెలంగాణల్లో క్వారంటైన్లు, ఐసొలేషన్ వార్డులు పెద్ద ఎత్తున ఏర్పాటు అయ్యాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. పార్కుల్లో సైతం సందర్శకుల సంఖ్య తగ్గింది. జనం గుమికూడి ఉండటంపై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనధికారికంగా కర్ఫ్యూ విధించిన సందర్భాలు కనిపిస్తున్నాయి.

Covid-19: May Lord help us in these troubled times, says YSRCP MP Parimal Nathwani

ఇంతా చేస్తున్నప్పటికీ.. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. భారత్‌లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 169కి చేరింది. రోజురోజుకూడా ఈ సంఖ్యలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సన్నిహితుడు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వాని ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారి నుంచి ఇక ఆ దేవుడే ఈ ప్రపంచాన్ని కాపాడాల్సి ఉందని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏడుకొండలవాడే దిక్కు అంటూ ఆయన ప్రార్థించారు. వెంకటేశ్వర స్వామికి చెందిన ఓ చిన్న వీడియో క్లిప్‌ను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. గోవింద నామాలతో కూడిన వీడియో అది. కరోనా వైరస్ బారి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేది ఆ దేవుడొక్కడేనంటూ ఆయన కామెంట్స్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తోటి రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డిలకు ట్యాగ్ చేశారు.

English summary
Ruling YSR Congress Party's Rajya Sabha member Parimal Nathwani tweeted as may Lord help us in these troubled times. Lord Venkateswara Swamy will bring some light amidst us as dark clouds of Coronavirus hover over us, he tweeted. This beautiful video providing rare Darshan of Lord Sri Venkateswara Swamy of Tirumala Tirupati Devasthanam in full splendour, Nathwani mentioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X