వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రేవంత్ ఆరోపణలపై చంద్రబాబు విచారణ చేయించాలి'

ఏపీ మంత్రులపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఏపీ మంత్రులపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

అనంతపురంలో ఆదివారం నాడు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్ లు ఎలా వచ్చాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించారు.

Cpi demands to Chandrababunaidu conduct enquiry on Revanth allegations

. పోలవరం ప్రాజెక్ట్ కు చంద్రబాబు వ్యతిరేకమన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్దమని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విస్తరణకు వ్యతిరేకంగా వారు ఉద్యమించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపీలోని కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుపై చర్యలు చేపట్టాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కోరారు.

English summary
Cpi national secretary Narayana demanded Ap CM Chandrababunaidu conduct enquiry on TTDP leader Revanth Reddy allegations.He spoke to media on Sunday at Anantapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X