వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'పవన్ కళ్యాణ్, వైయస్ జగన్ ఎవరు చేసినా ఓకే, మద్దతిస్తాం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరు పాదయాత్ర చేసినా తాము స్వాగతిస్తామని సిపిఎం నేత మధు గురువారం తెలిపారు.ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా తాము మద్దతు పలుకుతామని
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరు పాదయాత్ర చేసినా తాము స్వాగతిస్తామని సిపిఎం నేత మధు గురువారం తెలిపారు.
వీరే కీలకం.. ఎవరు ఎటువైపు: అప్పుడు శిల్పా సర్వే చేయిస్తే.., అఖిల కలిసి నడిచేనా?
ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా తాము మద్దతు పలుకుతామని చెప్పారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గరకపర్రులో అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ సిగ్గుచేటు అన్నారు. గరకపర్రులో సోషల్ బాయ్కాట్ను వెంటనే ఎత్తివేయాలన్నారు.
చిత్తూరులో జరిగి ఉత్సవాల్లో దళితులను పాల్గొననీయకపోవడం దారుణం అన్నారు. అక్వా చెరువుల విస్తరణలో దళితులకు పని లేకుండా పోయిందన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ ఖండించాలన్నారు.
Comments
ys jagan pawan kalyan jana sena cpm madhu andhra pradesh padayatra వైయస్ జగన్ పవన్ కళ్యాణ్ జనసేన సిపిఎం మధు ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర
English summary
CPM leader Madhu on Thursday said that they will welcome YSR Congress Party chief YS Jaganmohan Reddy's padayatra over public issues. He condemned attacks on Dalit people.
Story first published: Thursday, July 13, 2017, 14:25 [IST]