వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సమాధానం చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు', లాలూచీపై సుజాత హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

అమరావతి: తన పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇచ్చుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య గురువారం విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టిడిపి నేతల అవినీతితో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్నారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Chandrababu Naidu

లాలూచీ పడితే చర్యలు: పీతల సుజాత

ఉచిత ఇసుక పక్కదారి పట్టడం పైన మంత్రి పీతల సుజాత గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలూచీ పడిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

గనుల శాఖ పైన పీతల సుజాత ఈ రోజు సమీక్ష నిర్వహించారు. విజయనగరం జిల్లాలో ఇనుము, మాంగనీస్ నిక్షేపాలు గుర్తించామన్నారు. గనుల శాఖ ద్వారా రూ.1700 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటికే రూ.736 కోట్ల ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు.

English summary
Congress leader C Ramachandraiah fired out at AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X