బాబుకు 'రియల్ ఎస్టేట్' లింకు!: సీఆర్డీఏపై మాజీ మంత్రి ఝలక్..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు.
విజయవాడ: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. అందుకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం చేపట్టినట్లు సీఎం చంద్రబాబు పలు వేదికలపై చెప్పారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉండే అవకాశమున్నా.. వీలైనంత త్వరగా రాజధానిని నిర్మించాలన్న ఉద్దేశంతోనే విజయవాడకు మకాం మార్చినట్లు తెలిపారు.
అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు. మూడేళ్ల కాలంలో ఆయన రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కాస్త 'చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్దిని పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ జిల్లాలకు చుక్క నీరు కూడా ఇవ్వడం లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతేనని, ఇందులో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. రాయలసీమపై చంద్రబాబుది కపట ప్రేమేనని విమర్శించారు.