సిఆర్డిఏలో భూ కేటాయింపుల వివరాలు ఇవి:మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి: సీఆర్డీఏపై గురువారంలో జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో భూ కేటాయింపులకు సంబంధించి పలు కీలమమైన నిర్ణాయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.
సిఆర్డిఏలో ఇప్పటి వరకు 1312 ఎకరాలను 65 సంస్థలకు కేటాయించామని తెలిపారు. అయితే రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు జరిపిన 65 సంస్థల్లో 7 సంస్థలు మాత్రమే నిర్మాణాలు చేపట్టాయని మంత్రి నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలో భూకేటాంపులు చేసినా ఇంకా పనులు ప్రారంభించని ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు.
అలాగే బాబు జగజ్జీవన్ రాం స్మృతివనానికి 10 ఎకరాలు, ఇండియన్ ఆర్మీకి 4 ఎకరాలు, చండ్ర రాజేశ్వర రావు ట్రస్ట్కు 3 ఎకరాలు, ఇషా ఫౌండేషన్కు 10 ఎకరాల చొప్పున కేటాయింపులకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇలా 8 సంస్ధలకు 56 ఎకరాలు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.
వచ్చే మంత్రి వర్గ సమావేశంలో విట్, ఎస్ఆర్ఎం, మాతా అమృతమయి లాంటి సంస్థలకు మరో 100 ఎకరాల చొప్పున కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు.