వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో తగ్గిన క్రైమ్‌రేట్, 5739 మందికి విముక్తి, పోలీసులకు వీక్లీ ఆఫ్: డీజీపీ గౌతమ్ సవాంగ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌రేట్ తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతేడాది పోలిస్తే 6 శాతం తగ్గిందని వివరించారు. మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు కూడా తగ్గాయని.. విశాఖపట్టణం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కాస్త మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పారు. ఈ ఏడాది ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు

జాతీయస్థాయిలో గుర్తింపు

ఏపీ పోలీసులు ప్రొఫెషనల్‌గా జాతీయస్థాయిలో అవార్డులు పొందారని గుర్తుచేశారు. ఒకే వేదిక మీద ఏడు అవార్డులు తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు అవార్డు దక్కించుకోలేదని చెప్పారు. గ్రామ సంరక్షణ సమితి అధ్యక్షురాలిగా మహిళను నియమించామని, వార్డు సంరక్షణ సమితిలో కూడా మహిళను పెట్టారని పేర్కొన్నారు.

 జీరో శాతం ఎఫ్ఐఆర్

జీరో శాతం ఎఫ్ఐఆర్

గుట్కా, ఇసుక, బెల్ట్ షాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపమని చెప్పారు. జూదం, పేకాట క్లబ్‌లను కూడా మూసివేశామని గౌతమ్ సవాంత్ తెలిపారు. దిశ బిల్లును సమర్ధవంతంగా అమలు చేస్తామని వెల్లడించారు. అన్ని పోలీసు స్టేషన్లలో జీరో శాతం ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నాయని చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్‌ కార్యక్రమంతో 5739 మంది చిన్నారులను రక్షించామన్నారు. 46 మంది ప్రాణాలను డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది కాపాడారని తెలిపారు.

 వీక్లీ ఆఫ్..

వీక్లీ ఆఫ్..

పోలీసుల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనివిధంగా వీక్లీ ఆఫ్ ఇస్తున్నామని వివరించారు. పోలీసులు కూడా మనుషులేనని భావించి ప్రభుత్వం వారంతాపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. 1861 పోలీసు యాక్ట్‌ను ప్రభుత్వం సవరించిందని వెల్లడించారు.

English summary
crime rate 6 percent decrease in ap dgp gautam sawang said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X