ఓటేసిన దాసరి, కెవిపి, విజయసాయి రెడ్డి (పిక్చర్స్)
హైదరాబాద్: లోకసభకు, శాసనసభకు తెలంగాణలో జరిగిన పోలింగ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ దర్సక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా హైదరాబాదులో తన ఓటు వేశారు. కాంగ్రెసు మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి, సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి కూడా హైదరాబాదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఫ్యామిలీతో బాలకృష్ణ ఇలా
తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కూతుళ్లతో కలిసి వచ్చి ఓటు వేశారు.
బివిఆర్ మోహన్ రెడ్డి...
ఇన్ఫోటెక్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన చూపుడు వేలిని ప్రదర్శించారు.
దాసరి నారాయణ రావు
ప్రముఖ సినీ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇలా కనిపించారు.
రెడ్డి ల్యాబ్స్ చైర్మన్...
రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ జివి ప్రసాద్ బంజారాహిల్స్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇలా కనిపించారు.
కెవిపి రామచందర్ రావు ఇలా...
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తన ఓటు వేసిన తర్వాత సిరా చుక్కతో ఉన్న చూపుడు వేలిని ప్రదర్శిస్తూ ఇలా..
విజయసాయి రెడ్డి ఇలా...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి తన ఓటు వేసిన తర్వాత ఇలా కనిపించారు.
ఓ వృద్ధురాలు ఇలా...
ఓ వృద్ధురాలు నడవలేని స్థితిలో చక్రాల కుర్చీపై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని తన నిబద్ధతను చాటుకుంది.
సర్వే సత్యనారాయణ ఇలా...
కాంగ్రెసు మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఇలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.