'ఏపీ రాజధానిగా దొనకొండ బెస్ట్': జగన్పార్టీ నేత కూడా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇటీవల దొనకొండ పేరు కూడా వినిపిస్తోంది. దొనకొండ.. ప్రకాశం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ బాగుంటుందనే అభిప్రాయాలు ఇటీవల వ్యక్తమవుతున్నాయి. గుంటూరు - విజయవాడ, అమరావతి కేంద్రంగా.. ఇలా తదితర ప్రాంతాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా దొనకొండ పేరు వినిపిస్తోంది. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని అంతగా అనుకూలం కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దొనకొండ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజధాని సాధనా సమితి శనివారం.. దొనకొండను ఏపి రాజధాని చేయాలని డిమాండ్ చేసింది. ప్రపంచానికి ధాన్యాగారంగా ఉన్న ప్రాంతానికి నష్టం కలిగించకుండా భూములు వినియోగంలో లేని ప్రాంతాన్ని గుర్తించి ఏపీ రాజధానిగా ప్రకటించాలని రాజధాని సాధనా సమితి కోరింది.
13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యలో ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని సమితి వ్యవస్థాపక అభిప్రాయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లాలో పర్యటించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయాలని కమిటీని కోరనున్నట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఒకరు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.