ఢిల్లీ నుంచి చక్రం తిప్పడం ఆపండి: కాంగ్రెస్-బీజేపీలకు పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉదయం తొమ్మిన్నర గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ట్వీట్లు కూడా చేశారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ కేంద్రాలుగా రాజకీయాలను ఆపేయాలని సూచించారు. అక్కడి నుంచి దేశం మొత్తాన్ని నియంత్రించడం వెంటనే ఆపేయాలని హితవు పలికారు.
జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!
భారత దేశ సమగ్రతను కాపాడాలంటే ఆ రెండు జాతీయ పార్టీలు యూపీ, బీహార్, ఢిల్లీలు కేంద్రంగా రాజకీయాలు ఆపేయాలని చెప్పారు. అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దేశవ్యాప్తంగా తిరగాలన్నారు. అప్పుడే ఆయా రాష్ట్రాల (మీ) ప్రజల గురించి తెలుస్తుందన్నారు. ఢిల్లీ మాత్రమే భారత్ కాదన్నారు.