నోట్ల రద్దుకు 50 రోజులు: విత్ డ్రాపై మోడీ ఊరట ప్రకటన!
నోట్ల రద్దు పూర్తయి యాభై రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశముంది. ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడవచ్చు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పూర్తయి యాభై రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశముంది. ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడవచ్చు. ఇదిలా ఉండగా, నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంలలో తీసుకునే డబ్బు పైన పరిమితులు ఉన్నాయి.
ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటించి యాభై రోజులు అవుతున్నందున, ఆయన ప్రజలను యాభై రోజుల సమయం కోరినందున.. ఏటీఎంల చేసే విత్ డ్రాల పైన ఆంక్షలు సడలించే అవకాశాలున్నాయని అంటున్నారు.
సమాచారం మేరకు బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన మోడీ చేయనున్నారని అంటున్నారు.
నోట్ల రద్దు: డిసెంబర్ 30 దాటినా... విత్డ్రా 'మరో' షాకింగ్
ప్రస్తుతం రోజుకు రూ.2500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. డిసెంబర్ 30వ తేదీన ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.