టీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా , కుల, మత పిచ్చితో ... చంద్రబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధ్వజం
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును గురించి, రామతీర్థం రాముడు విగ్రహం ధ్వంసం ఘటనపై , అలాగే డిజిపిపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలో వెనక ఉంది టిడిపి నేతలే అని తేల్చి చెబుతున్నారు.
చంద్రబాబు పుట్టుకే కుట్రలతో మొదలైంది
చంద్రబాబు నాయుడు పుట్టడమే కుట్రతో పుట్టాడని, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు కొనసాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి విభజించి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటని మండిపడ్డారు. చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు కమ్మ-రెడ్డి వర్గాలు గా విడదీసి రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. కావాలని రాష్ట్రంలో కుల ఘర్షణలు ,మత ఘర్షణలకు చంద్రబాబు తెర తీస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ పిచ్చి పట్టిన కుక్కల లాగా వ్యవహరిస్తున్నారు
తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ పిచ్చి పట్టిన కుక్కల లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు మతపిచ్చి, కులపిచ్చి ఎక్కువైందని పేర్కొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి బాబు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ద్వజమెత్తారు. ఇంటింటికి బియ్యం పంపిణీకి సంబంధించి ఏర్పాటైన వాహనాలపై సైతం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు.
కులాలను , మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు
కులాలను, మతాలను రాజకీయాల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని నారాయణస్వామి మండిపడ్డారు .చంద్రబాబు రాజకీయంగా పతనం అయ్యారని నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఏపీలో ఆలయాలపై దాడులు , విగ్రహ ద్వంసం ఘటనల నేపధ్యంలో అటు టీడీపీ , ఇటు అధికార వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతుంది .