కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీఎం తర్వాత నేనే: కేఈ ఆవేశం

టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నా

|
Google Oneindia TeluguNews

కర్నూలు: టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నారు.

జగన్ అలా.. బాబు ఇలా..: బుట్టా రేణుకపై రోజా పవర్ పంచ్‌లుజగన్ అలా.. బాబు ఇలా..: బుట్టా రేణుకపై రోజా పవర్ పంచ్‌లు

ఈ సందర్భంగా తనకు రైతు రుణమాఫీ కాలేదంటూ.. ఓ రైతు డిప్యూటీ సీఎంను నిలదీశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి ఆగ్రహంతో ఊగిపోయారు. 'షటప్! డోంటాక్! చేతులు చూపిస్తూ మాట్లాడతావా?' అంటూ ఆవేశంగా హెచ్చరించారు.

Deputy cm ke krishnamurthy fired farmers

Recommended Video

World Bank shock to Chandrababu అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ డైలమా? | Oneindia Telugu

'సారా తాగొచ్చిన నాయాళ్లతో కలిసి గొడవ చేస్తావా? ఫ్యాక్షన్ గ్రామాల్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి ఇక్కడికి వచ్చా' అని కేఈ కృష్ణమూర్తి సదరు వ్యక్తితో అన్నారు. అంతేగాక, 'ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డిప్యూటీ సీఎంతో.. అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిని నేను' అని కేఈ ఆగ్రహంగా మాట్లాడారు.

1978లో డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేశానని, చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరం కూడా టీడీపీలో చేరామని చెప్పుకొచ్చారు.

English summary
Andhra Pradesh Deputy CM KE Krishnamurthy on Tuesday fired farmers in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X