నేపాల్లో చిక్కుకున్న దేవేందర్ గౌడ్ తనయుడు: కేంద్ర మంత్రులకు వినతి
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత దేవేందర్గౌడ్ బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. నేపాల్లో చిక్కుబడిపోయిన తన కుమారుడు వీరేందర్గౌడ్ సహా 16 మంది బృందాన్ని తక్షణం రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
భూకంపంతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరేందర్ బృందం ఇటీవల అక్కడకు వెళ్లింది.వారు ఆ పనుల్లో ఉండగానే మంగళవారం మరోసారి భారీ భూకంపం విరుచుకుపడింది.

ఈ సమయంలో వారు సింధుపాల్చౌక్ జిల్లా స్యాయూల్ బజార్ గ్రామంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వీరేందర్ బృందాన్ని ఆర్మీ హెలీకాప్టర్ల సహాయంతో రక్షించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను దేవేందర్ గౌడ్ కోరారు.
వారు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు విజ్ఞప్తి చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications