ఖైరతాబాద్: జోరువానలో దర్శించుకున్నారు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా భక్తులు క్యూలైన్లలో ఉండి ఏకదంతుని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నగరం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి రావడంతో జనసందోహంగా మారింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష మంది వరకు భక్తులు గణనాథుడ్ని దర్శించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రతి భక్తుడు 60 అడుగుల ఎత్తులో కొలువుదీరిన గణపతి ప్రతిమను తమ సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనందంగా దర్శించుకున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఉత్సవ కమిటీ పేర్కొంది. గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, తమ పిల్లలు, వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానిత వస్తువులుగాని, అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహా గణపతి
నగరంలోని ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.
మహా గణపతి
జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా భక్తులు క్యూలైన్లలో ఉండి ఏకదంతుని దర్శించుకున్నారు.
మహా గణపతి
ఆదివారం సెలవు రోజు కావడంతో నగరం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి రావడంతో జనసందోహంగా మారింది.
మహా గణపతి
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఖైరతాబాద్ మహా గణపతి వద్ద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహా గణపతి
ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష మంది వరకు భక్తులు గణనాథుడ్ని దర్శించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు.
మహా గణపతి
ప్రతి భక్తుడు 60 అడుగుల ఎత్తులో కొలువుదీరిన గణపతి ప్రతిమను తమ సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనందంగా దర్శించుకున్నారు.
మహా గణపతి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఉత్సవ కమిటీ పేర్కొంది.
మహా గణపతి
గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, తమ పిల్లలు, వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మహా గణపతి
అనుమానిత వస్తువులుగాని, అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహా గణపతి
కొలువుదీరిన మహా గణపతి ప్రతిమను తమ సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనందంగా దర్శించుకున్నారు.