వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి,టిడిపి గుర్తింపును రద్దు చేయండి:ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం, రాష్ట్రం విఫలమయ్యాయంటూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఏపీ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం ఆ రెండు పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఈసీని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరారు.
ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలన్న టిడిపి-బిజెపి ఇప్పుడు మాట మార్చాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు విభజన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
అనంతరం మరో కాంగ్రెస్ నేత కెవిపి మాట్లాడుతూ మోడీకి ఏ మాత్రం నైతిక విలువలున్నా హోదా హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ ఎప్పుడు కలిసుంటాయో ఎప్పుడు విడిపోతాయో చెప్పలేమని...ఈ రాజీనామా డ్రామాలు కొత్త కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
andhra pradesh new delhi apcc chief raghuveera complaint election commission tdp bjp ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ అధ్యక్షుడు ఫిర్యాదు ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు టిడిపి బిజెపి
English summary
The APCC chief Raghuveera Reddy has asked the Central Election Commission to disclose the two parties BJP and TDP because those parties failed to fulfill the election promises in AP.
Story first published: Friday, March 9, 2018, 18:14 [IST]