రాజధాని రైతులు ఆడంగి వెధవలా ..రోజాపై దివ్యవాణి ఫైర్..రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వారింగ్
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి ఫైర్ అయ్యారు . రాజధానిలో అమరావతి కోసం పోరాటం చేస్తుంది రైతులు కాదని ఆడంగి వెధవల్లా మహిళలను ముందుకు నెట్టి వెనక దాక్కుంటున్నారా? అని ,రాజధాని రైతులు మగాళ్ళు కాదా .. వాళ్లకు దమ్ము లేదా అని రోజా చేసిన వ్యాఖలకు దివ్యవాణి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
రాజధానిలో మగాళ్ళు లేరా? వాళ్లకు ఉద్యమం చేసే దమ్ము లేదా ? ఆడంగి వెధవల్లా: రోజా షాకింగ్ వ్యాఖ్యలు
మాట్లాడే ముందు రోజా తన చరిత్ర తెలుసుకోవాలన్న దివ్యవాణి
మహిళలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడిన టీడీపీ నేత దివ్యవాణి రోజా మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. మహిళలను ముందుకు నెట్టారని రాజధాని రైతులు పోరాటం చెయ్యలేరా అన్న వ్యాఖ్యలకు సమాధానంగా జగన్ జైల్లో ఉంటే ఆయన తల్లి, చెల్లి రోడ్ల మీద తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు. అలాగే భర్త ఇంట్లో ఉంటె రోజా ఎమ్మెల్యేగా ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రోజా బదులు రోజా భర్త ఎమ్మెల్యే కావచ్చు కదా అని అడిగారు దివ్యవాణి.
మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చెయ్యటం తప్పని తెలియదా అని ప్రశ్న
రోజా ఒక మహిళ అయ్యుండి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చెయ్యటం తప్పని తెలియదా అని ప్రశ్నించారు. రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని దివ్యవాణి హెచ్చరించారు. ఇక రాజధాని అమరావతిలో మహిళల పోరాటం మీద విమర్శలు చేసిన రోజా మహిళలపై లాఠీచార్జ్ జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పదవుల కోసం నోరు మెదపవా? అని దివ్యవాణి రోజాపై విరుచుకుపడ్డారు .
మగతనాల గురించి మాట్లాడటం సంస్కారమా ? దివ్యవాణి ఆగ్రహం
రోజా రాజధాని ప్రాంత పురుషులను ఉద్దేశించి వారు మగాళ్ళు కాదా అంటూ మగతనాల గురించి మాట్లాడారని, అలా మాట్లాడొద్దు అని పేర్కొన్నారు . మేము కూడా నీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం ఉంది అని దివ్యవాణి పేర్కొన్నారు . రోజా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించలేదని దివ్యవాణి నిలదీశారు. వైసీపీలో ఉన్న మహిళా నాయకులు మహిళల విషయంలో స్పందించకపోవటం దారుణం అని దివ్యవాణి పేర్కొన్నారు.