చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దివాకర్ ట్రావెల్స్ బస్సుపై రాళ్ల దాడి: వెంటపడి పట్టుకున్నారు

జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుపై ఇద్దరు యువకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారిని వెంబడించి పట్టుకున్న బస్సు డ్రైవర్.. వారిని పోలీసులకు అప్పగించారు. కాగా, బస్సులోని ప్రయాణికులు మాత్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుపై ఇద్దరు యువకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారిని వెంబడించి పట్టుకున్న బస్సు డ్రైవర్.. వారిని పోలీసులకు అప్పగించారు. కాగా, బస్సులోని ప్రయాణికులు మాత్రం ఈ పరిణామంతో భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం కుప్పం నుంచి హైదరాబాదుకు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలోని మొరసనపల్లె సమీపంలో వచ్చే సరికి శాంతిపురం వైపు నుంచి కుప్పం వైపు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఇద్దరు యువకులు దివాకర్‌ బస్సు ముందుభాగం అద్దాలపై రాళ్ళు విసిరారు.

diwakar travels bus attacked with stones

దీంతో అద్దం పగిలిపోయింది. దీంతో బస్సు డ్రైవర్‌లు ఆ యువకులను పట్టుకునేందుకు వెంబడించారు. కనుమలదొడ్డి దాటేసరికి ఆ యువకుడను పట్టుకున్న డ్రైవర్లు.. పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. కాగా, బస్సు అద్దాలు పగిలిపోవడంతో బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

English summary
It is said that Diwakar travels bus attacked with stones by two youths in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X