మల్కాజిగిరిలో పోటీ: సైకిలెక్కనున్న డిఎల్ రవీంద్రారెడ్డి?
రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టిడిపి జిల్లా నేతలు అధిష్ఠానంతో చర్చించి ఆయనను పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. గట్టి ప్రయత్నాలే చేశారు.
ఆయన పార్టీలోకి వస్తే రాజధాని పరిధిలోని మల్కాజీగిరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపాలని తెలుగుదేశం పా్రటీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఆయన మొదటి నుండి పోటీ చేస్తూ వచ్చిన కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానాన్ని ఇప్పటికే ఆయన టిడిపి నేతలకు పరోక్షంగా పరిచయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో టిడిపి నేతలతో కలిసి పాల్గొనడం ఇందుకు బలం చేకూరుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పుట్టా సుధాకర్యాదవ్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. డిఎల్ పార్టీలోకి వస్తే సుధాకర్ యాదవ్ గెలుపు సునాయాసమవుతుందని టిడిపి శ్రేణులు ఆశపడుతున్నాయి.