ఆసక్తికరం: నారా వారి ఆస్తుల చిట్టాలో ఆభరణాల విలువెంతో తెలుసా?
విజయవాడ: ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులను శుక్రవారం ప్రకటించారు. ఎవరి ఆస్తులు ఎంత అన్న విషయం పక్కనపెడితే... లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణికి ఉన్న బంగారు ఆభరణాలపై అందరికీ ఆసక్తి పెరిగింది.
నారా భువనేశ్వరి పేరిట, రూ. 1,27,16,000 విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. నారా బ్రాహ్మణి పేరిట రూ. 2,325 గ్రామల బంగారం సహా వజ్రాలు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తంగా భువనేశ్వరి పేరిట దాదాపు రూ. 60 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
అందులో బంగారు, వెండి ఆభరణాలు లెక్క ఎంతంటే... విలువైన రాళ్లు పొదిగిన 3,519 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ. 1,27,16,000. వెండి 32 కిలోల 7 గ్రాములు.. అంటే దాని విలువ రూ. 4,57,000. చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పేరు మీద ఇప్పటికే రూ. 2,27,000 విలువైన వెండి ఉయ్యాల ఉంది.
నారా బ్రాహ్మణి ఆభరణాల విషయానికి వస్తే.. రూ. 2,325 గ్రాముల బంగారం, 310.06 క్యారట్ల వజ్రాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 15,95,000. ఇంకా రూ. 12,37,000 విలువైన 97 కిలోల వెండి ఆభరణాలు బ్రాహ్మణి పేరుమీద ఉన్నట్లు సమాచారం.