కర్నూల్ జిల్లాలో జంటహత్యలు, వివాహేతర సంబంధమే కారణమా?
ఆదోని విక్టోరియాపేటలో దారుణం జరిగింది. అన్నదమ్ముళ్లు నాగేంద్ర, నరేష్లు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులురాత్రి నాగేంద్రను కిడ్నాప్ చేసారు. అడ్డుకోబోయిన నరేష్పై కత్తులతో దాడి చేశారు.
కర్నూల్: ఆదోని విక్టోరియాపేటలో దారుణం జరిగింది. అన్నదమ్ముళ్లు నాగేంద్ర, నరేష్లు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులురాత్రి నాగేంద్రను కిడ్నాప్ చేసారు. అడ్డుకోబోయిన నరేష్పై కత్తులతో దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నరేష్ మృతి చెందాడు.
ఎల్ఎల్సీ కాలువ వద్ద నాగేంద్రను దుండగులు నరికి చంపారు.నాగేంద్రను హత్య చేసి మృతదేహాన్ని అక్కడే తగులబెట్టారు.పోలీసులు మృతదేహలను పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నాగేంద్ర, నరేష్ను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
English summary
Double murders in Kunoll district on Monday.Nagendra and Naresh were murdered unknown persons in Adoni town. police registered case.
Story first published: Monday, September 4, 2017, 11:46 [IST]