32 లక్షల ఇళ్లకు మంచినీరు, రూ.4800 కోట్ల వ్యయం.. వైసీపీ ఎంపీ విజయసాయి..
గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో అందరికీ తెలుసు అని వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలకు తెలుసు అని.. అందుకే వైసీపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చేతల సర్కార్ అని స్పష్టంచేశారు. ప్రజల సాధక బాధకాలు తెలుసు అని.. అందుకే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తుచేశారు.
ఇంటింటికీ మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విజయసాయి రెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.4800 కోట్ల వ్యయం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో అందరికీ పరిశుభ్రమైన, స్వచ్చమైన తాగునీరు అందబోతుందని తెలిపారు. కోతలు ఎవరు కోస్తారో జనాలకు తెలుసు అని స్పష్టంచేశారు. అందుకే వారిని అధికారానికి దూరం చేశారని వెల్లడించారు.
ప్రజలకు అత్యున్నత స్థాయి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ గారి ప్రభుత్వం పనిచేస్తోంది.ఈ క్రమంలో గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది.తొలిదశలో రూ.4,800 కోట్లుతో32 లక్షల ఇళ్ళకు కుళాయిలు ఏర్పాటు.ఇది చేతల ప్రభుత్వం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 6, 2020
తొలిదశలో 32 లక్షల ఇళ్లకు మంచినీరు అందబోతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం లాంటి ప్రాంతాలకు ఇది మరింత మేలు చేస్తోందని తెలిపారు. ఇకపై కిడ్నీ సమస్య ఉండబోదు అనే ధీమాను వ్యక్తం చేశారు. అందరికీ సురక్షితమైన మంచినీటిని ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వాలు మాత్రం మాటలు కోటలు దాటేవని విమర్శించారు. కానీ చేసిన పనులు ఏవీ లేవన్నారు.
చెప్పకున్నా.. ప్రజల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని విజయసాయి తెలిపారు. అందుకే మంచినీటి కోసం తొలిదశలో ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరో రెండు నుంచి మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా మంచినీరు అందిస్తామనే సంకేతాలను ఇచ్చారు. వైసీపీ అంటేనే చేతల ప్రభుత్వం అని.. మాటలు ఉండబోవు అని పేర్కొన్నారు.