వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

32 లక్షల ఇళ్లకు మంచినీరు, రూ.4800 కోట్ల వ్యయం.. వైసీపీ ఎంపీ విజయసాయి..

|
Google Oneindia TeluguNews

గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో అందరికీ తెలుసు అని వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలకు తెలుసు అని.. అందుకే వైసీపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చేతల సర్కార్ అని స్పష్టంచేశారు. ప్రజల సాధక బాధకాలు తెలుసు అని.. అందుకే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తుచేశారు.

ఇంటింటికీ మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విజయసాయి రెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.4800 కోట్ల వ్యయం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో అందరికీ పరిశుభ్రమైన, స్వచ్చమైన తాగునీరు అందబోతుందని తెలిపారు. కోతలు ఎవరు కోస్తారో జనాలకు తెలుసు అని స్పష్టంచేశారు. అందుకే వారిని అధికారానికి దూరం చేశారని వెల్లడించారు.

తొలిదశలో 32 లక్షల ఇళ్లకు మంచినీరు అందబోతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం లాంటి ప్రాంతాలకు ఇది మరింత మేలు చేస్తోందని తెలిపారు. ఇకపై కిడ్నీ సమస్య ఉండబోదు అనే ధీమాను వ్యక్తం చేశారు. అందరికీ సురక్షితమైన మంచినీటిని ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వాలు మాత్రం మాటలు కోటలు దాటేవని విమర్శించారు. కానీ చేసిన పనులు ఏవీ లేవన్నారు.

drinking water supply in 32 lakhs houses

చెప్పకున్నా.. ప్రజల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని విజయసాయి తెలిపారు. అందుకే మంచినీటి కోసం తొలిదశలో ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. మరో రెండు నుంచి మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా మంచినీరు అందిస్తామనే సంకేతాలను ఇచ్చారు. వైసీపీ అంటేనే చేతల ప్రభుత్వం అని.. మాటలు ఉండబోవు అని పేర్కొన్నారు.

English summary
drinking water supply in 32 lakhs houses ysrcp mp vijaya sai reddy tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X